News February 6, 2025

పార్వతీపురం: ‘ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదు’

image

పార్వతీపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు సురక్షంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News February 23, 2026

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS ఆఫీసర్ అరెస్ట్

image

రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కి చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి బీహార్ వెళ్లారు. గుంటూరు నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు కాగా సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.

News February 23, 2026

ఆగిరిపల్లి: 12 ఏళ్ల తర్వాత చిక్కిన హత్య కేసు ముద్దాయి!

image

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో జరిగిన హత్య కేసులో A3గా ఉన్న అలవాల బాబ్జి, 2014 నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడు. నిందితుడిని గుంటూరు జిల్లా దాసరిపాలెంలో అదుపులోకి తీసుకుని, సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు.

News February 23, 2026

పురుషులు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

image

మొలతాడును ఓ సంప్రదాయమే అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. పిల్లల్లో హెర్నియా సమస్యలు రాకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను, పొట్ట పెరుగుదలను హెచ్చరిస్తుంది. పూర్వం గోచి ధరించడానికి ఇది ప్రధానాధారం. సామాజికంగా ‘మొలతాడు కట్టిన మగాడివైతే’ అనే సవాలు ఆ వ్యక్తి వివాహానికి అర్హుడైన పురుషుడనే గుర్తింపును సూచిస్తుంది. స్త్రీలకు కూడా చిన్నతనంలో మొలనూలు ధరించే ఆచారం ఉంది.