News January 25, 2025

పార్వతీపురం: ‘ఓటే సామాన్యుడి ఆయుధం’

image

ఓటే సామాన్యుడి ఆయుధమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఓటు ప్రతి భారతీయుడి హక్కు అని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

image

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.

News September 14, 2025

JGTL: ‘శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు’

image

శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ బండి తరాల శ్రీకాంత్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్‌పై పీడి యాక్ట్ అమలు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ కరుణాకర్ శనివారం నిందితుడికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులను అందజేశారు.

News September 14, 2025

HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

image

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.