News February 26, 2025

పార్వతీపురం జిల్లాలో ఎంత మంది MLC ఓటర్లు ఉన్నారంటే..!

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇందులో 1,574 మంది పురుషులు 759 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల విధుల కోసం 18 మంది పిఓలు, 18 మంది ఏపీవోలు, 36 మంది ఓపిఓలు, 18 మంది ఏవోలను నియమించినట్లు చెప్పారు.

Similar News

News February 26, 2025

బాలీవుడ్ నటుడి విడాకుల వార్తలపై క్లారిటీ

image

బాలీవుడ్ నటుడు గోవింద విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు స్పందించారు. భార్య సునీతతో గోవిందకు అభిప్రాయభేదాలు ఉన్నాయని, అయితే అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కాదని ఆయన మేనేజర్ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విడాకుల వార్తలన్నీ అవాస్తవమని గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.

News February 26, 2025

కృష్ణా జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: ఎస్పీ

image

కృష్ణా జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధర రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషం జరుపుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

News February 26, 2025

HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

image

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.

error: Content is protected !!