News March 17, 2025
పార్వతీపురం జిల్లా ప్రజలకు హెచ్చరిక

పార్వతీపురం మన్యం జల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మిపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట , సీతనగరం, వీరఘట్టం మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News September 17, 2025
మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
12వేల మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు: కలెక్టర్

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News September 17, 2025
తిరుపతి DSC అభ్యర్థులకు DEO సూచనలు

తిరుపతి జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CMచేత అపాయింట్మెంట్ ఆర్డర్స్ మంజూరు చేస్తున్నట్లు DEO KVN కుమార్ బుధవారం తెలిపారు. DSC అభ్యర్థుల కోసం చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు గురువారం ఉదయం 7 గంటలకు ఈ కాలేజీ వద్దకు ఫొటో, ఆధార్, కాల్ లెటర్తో హాజరు కావాలన్నారు.