News February 11, 2026

పార్వతీపురం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పార్వతీపురం జిల్లాలో మొత్తం 10,882 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. వీరి కోసం 67 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.

Similar News

News February 21, 2026

బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి: ఇందిర

image

BHPL: పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్ధుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర సూచించారు. పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న బీసీ, ఈబీసీ విద్యార్ధుల ఖాతాల్లో ఉపకారవేతనాల మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయాలని సూచించారు.

News February 21, 2026

అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

image

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.

News February 21, 2026

మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

image

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.