News February 6, 2025

పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.

Similar News

News December 25, 2025

తిరుమలలో RSS చీఫ్..

image

తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాలను RSS చీఫ్ మోహన్ భాగవత్ ఇవాళ సందర్శించారు. హిందూ సంప్రదాయంలో గోపూజకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేశారు. తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు.

News December 25, 2025

CM కలిసిన కొండారెడ్డిపల్లి సర్పంచ్‌

image

కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్య గురువారం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధికి బాటలు వేసినందుకు సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, గ్రామ నాయకులు కూడా ఉన్నారు.

News December 25, 2025

మహబూబాబాద్‌కు కేటీఆర్‌.. ఎప్పుడంటే

image

ఈనెల 27న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచుల ‘అభినందన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కొత్త సర్పంచులను కేటీఆర్‌ సన్మానిస్తారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు.