News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,
Similar News
News March 19, 2025
వనపర్తి: త్వరలోనే ముస్లింలకు ఇఫ్తార్ విందు..

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు విషయంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
News March 19, 2025
ALERT: రేపు 59 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 19, 2025
అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ బ్యాంకు అధికారులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రాధాన్యత రంగాల్లో రుణాలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం నాబార్డ్ సిద్ధం చేసిన ప్లాన్ను ఆయన ఆవిష్కరించారు.