News February 1, 2025
పార్వతీపురం : రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి

రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. రూరల్, అర్బన్, వాణిజ్య ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా ధరలు ఉంటాయని చెప్పారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2-10 శాతం, పాలకొండ నియోజకవర్గం లో 30-40, కురుపాం నియోజకవర్గంలో 13 -40 శాతం, సాలూరు నియోజకవర్గం లో 16- 20 శాతం ఛార్జీలు పెరిగాయన్నారు. నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
Similar News
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 12, 2025
వనపర్తి: నవంబర్ 14 నుంచి ‘మిషన్ మధుమేహ-దృష్టి’

డయాబెటిస్ రోగులు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభంలోనే సమస్యలను గుర్తిస్తే నివారించవచ్చని వనపర్తి ఇన్చార్జి DMHO సాయినాథ్ రెడ్డి అన్నారు. NOV 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని డయాబెటిస్ రోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ‘మిషన్ మధుమేహ-దృష్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను మంగళవారం DMHO కార్యాలయంలో నిర్వహించారు.
News November 12, 2025
జగిత్యాల: కిక్ బాక్సింగ్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025- 26 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజ గౌడ్, DRDO రఘువరన్ పాల్గొన్నారు.


