News March 27, 2025
పార్వతీపురం: రిపోర్టర్లు కావలెను

పార్వతీపురం మన్యం జిల్లాలో Way2Newsలో పనిచేసేందుకు రిపోర్టర్లు కావలెను. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు మాత్రమే అర్హులు. మీ వివరాలను <
Similar News
News March 30, 2025
కేసీఆర్పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.
News March 30, 2025
అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్

AP: కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ‘సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. తెలుగు ప్రజలు బాగుండాలనేదే చంద్రబాబు, నా ఆకాంక్ష’ అని తెలిపారు.
News March 30, 2025
రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .