News March 12, 2025
పార్వతీపురం: వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు

వేసవికాలంలో వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో తాగునీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ రేంజర్ బిర్లంగి రామ్ నరేశ్ తెలిపారు. మంగళవారం కొమరాడ మండలంలో సరుగుడు గూడ అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో కొమరాడ అటవీ శాఖ సెక్షన్ అధికారి బీట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 8, 2025
రేవంత్, కేసీఆర్కు కిషన్ రెడ్డి సవాల్

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్మీట్లో పేర్కొన్నారు. ‘రేవంత్ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.
News November 8, 2025
MBNR: ‘ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోండి’

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 13 వరకు లేడీస్ టైలరింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


