News March 29, 2025

పార్వతీపురం: శాశ్వత లోక్ అదాలత్‌పై అవగాహనా సదస్సు

image

ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించి శాశ్వత లోక్ అదాలత్ ఆవశ్యకత, సామర్ధ్యం పెంపుదల, కేసుల పరిష్కార విధానం, సామర్ధ్య పెంపుదల మార్గాలు, వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత లోక్‌ అదాలత్‌కు ఉందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 10, 2025

నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

image

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.

News November 10, 2025

మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

image

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.

News November 10, 2025

సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.