News August 28, 2024
పార్వతీపురం: సబ్సిడీపై తుంపర సేద్య పరికరాల సరఫరా

తక్కువ నీటి వనరులతో వ్యవసాయం చేయుటకు తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ITDA పరిధిలో గల గిరిజన సబ్ ప్లాన్ మండలాలలో తుంపర సేద్య రైతులకు 2024-25 సంవత్సరానికి గాను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ITDA పరిధిలో 750 మందికి గాను రూ.53.79 లక్షలు నిధులు విడుదల చేశామన్నారు.
Similar News
News February 22, 2026
VZM: బిల్లులు ఎప్పుడు?

విజయనగరం జిల్లాలో పెండింగ్ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.


