News November 16, 2025
పార్వతీపురం: ‘సివిల్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News April 5, 2026
భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News April 5, 2026
మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
News April 5, 2026
ట్రంప్ పర్మిషన్ లేకపోతే ఆయిల్ కూడా కొనలేరు: రాహుల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చమురు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్గానే అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత, డేటాను ట్రంప్ చేతుల్లో ఆయన పెట్టారు. రాజీపడటం వల్లే ఇదంతా జరిగింది’ అని అస్సాంలోని గోలాఘాట్లో అన్నారు.


