News February 25, 2025
పార్వతీపురం: 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో 48 గంటల పాటు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేయాలన్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు రోజున కూడా వీటిని మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News December 18, 2025
రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్పై అక్కసు

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.
News December 18, 2025
ఓదెల సర్పంచ్గా డా.సతీష్ ఘన విజయం

ఓదెల గ్రామ పంచాయతీ సర్పంచ్గా డా.సతీష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు డా.సతీష్కు శుభాకాంక్షలు చెప్పారు.
News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉపసర్పంచ్ ఎన్నికలకు ఆదేశాలు

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 18న కమాన్పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీపీలు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని స్పష్టం చేశారు.


