News November 22, 2025

పాలకుర్తి: ఫ్లెక్సీలో ఫొటోలు.. ఎమ్మెల్యేపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

image

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నేడు తొర్రూరులో నిర్వహించిన బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చారు. ఈక్రమంలో తమ అనుమతి లేకుండా ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో మండల నాయకుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వర్గ పోరు కొనసాగుతోందనే చర్చ జరుగుతోంది.

Similar News

News November 22, 2025

బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.

News November 22, 2025

సంగారెడ్డి జిల్లాలో ఓటర్ జాబితాపై కసరత్తు

image

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ జాబితాను ప్రదర్శించారు. ఓటు లేని వారు మరోసారి నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే పరిశీలన చేస్తున్నారు. ఈ 23వ తేదీన ఓటర్ తుది జాబితాను ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.

News November 22, 2025

హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

image

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.