News April 1, 2024
పాలకొండ: చెరువులో పడి వ్యక్తి గల్లంతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1711964883041-normal-WIFI.webp)
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2024
వీరఘట్టం: వైయస్సార్ విగ్రహం ధ్వంసం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720180680837-normal-WIFI.webp)
వీరఘట్టం మండలం తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 5, 2024
శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720179060125-normal-WIFI.webp)
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.
News July 5, 2024
శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720170463987-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.