News February 19, 2025
పాలకొండ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పాలకొండ రాబోతున్నట్లు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం తెలిపారు. ఇటీవల మరణించిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించినున్నట్లు వారు వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారని.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా టాప్

ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మద్యం షాపుల నిర్వహణలో జిల్లాకు మొదటి ర్యాంక్ లభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం తెలిపారు. మద్యం షాపుల నిర్వహణలో ప్రజల్లో సంతృప్తి శాతం అధికంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం మొదటి స్థానంలో ఉందన్నారు. నాణ్యమైన మద్యం, మంచి బ్రాండ్ లు, MRP అంశాలపై ర్యాంక్ ప్రకటించామన్నారు.
News February 20, 2025
రాజాం: జగన్ రాక.. హెలిప్యాడ్ స్థల పరిశీలన

నేడు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకొండ పట్టణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి హెలిప్యాడ్ స్థలాన్ని పాలవలస ధవళేశ్వరరావు, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డా. తలే.రాజేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 19, 2025
విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కె.అప్పలరాజు

విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కె.అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ.. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో, తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆదాయ రాబడిపై దృష్టి సారిస్తానని, పన్ను వసూళ్లు లక్ష్యాలను అధిగమించే దిశగా పని చేస్తానన్నారు.