News January 23, 2026

పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

image

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్‌లో చెప్పారు.

Similar News

News February 20, 2026

సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>సుప్రీంకోర్టు<<>> 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 23 నుంచి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్, Sr. కోర్ట్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి LLB, PG(మ్యూజియాలజీ), BLSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in

News February 20, 2026

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

image

గొర్రెల‌కు నీలి నాలుక వ్యాధి సోక‌కుండా ఉండాలంటే వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే దోమ‌ల‌ను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగ‌తా వాటికి వ్యాధి వ్యాపించ‌దు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.

News February 20, 2026

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసు.. UPDATE

image

TG: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను మూడోసారి నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. అందులో లోపాలు ఉన్నాయని, హార్డ్ డిస్క్‌లు, CDలు, పెన్‌డ్రైవ్‌లు జత చేయలేదని పేర్కొంది. కాగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 23 మందిపై కేసు నమోదైంది.