News November 16, 2025
పాలమూరు: ఈనెల 23 న NMMS పరీక్ష

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఏ.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ bsetelangana.gov.in ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
Similar News
News November 16, 2025
GNT: పవన్ కళ్యాణ్పై అంబటి సెటైరికల్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీమంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా చురకలంటించారు. “విశాఖ CIIసమ్మిట్లో చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బ.?’ అంటూ అంబటి పోస్ట్ చేశారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు అంబటిపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News November 16, 2025
MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.
News November 16, 2025
ములుగు: జిల్లాలో సమస్యలపై స్పందన కరవు!

జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సమస్యలపై స్పందన కరవైందని, ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న తనకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన విచారణ, చర్యలు లేకకపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం.


