News October 10, 2025
పాలమూరు: కోర్టు స్టే.. కాంగ్రెస్ MLA కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని కాంగ్రెస్ నేత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 10, 2025
సముద్ర తీర మడ భూముల మాయం.. అధికారుల మౌనం.!

కృష్ణా జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో మడ భూములు కనుమరుగవుతున్నాయి. పాలకుల కబంధహస్తాల్లో చిక్కుకున్న ఈ మడభూములు ఇప్పుడు చెరువులుగా మారాయి. ఇదే పరిస్థితి పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోనూ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న మడ భూములలో దాదాపు కనుచూపు మేర ఇప్పటికే చెరువులుగా మారిపోయాయని సమాచారం. ప్రకృతి సంపదలను రక్షించాల్సిన అధికారులు నిశ్చలంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News October 10, 2025
NZB: సీఎ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 11.45కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12.30కు NZB కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోర్గాం చేరుకుని రూరల్ MLA భూపతి రెడ్డి మాతృమూర్తి దినకర్మకు హాజరవుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి కలెక్టరేట్ నుంచి HYD వెళ్తారు.
News October 10, 2025
సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 ఫుట్ బాల్ పోటీలు మెదక్లోని వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.