News April 5, 2025
పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

ఏప్రిల్ 27న వరంగల్లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.
Similar News
News January 9, 2026
ఒక్కటవనున్న NCP? అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..!

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు NCP వర్గాలు మళ్లీ కలవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. పవార్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఇప్పుడు సర్దుకున్నాయని అన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. NCP ఫౌండర్ శరద్ పవార్తో గ్యాప్ తగ్గినట్లు అజిత్ మాటలను బట్టి అర్థమవుతోంది.
News January 9, 2026
NGKL: పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. కొల్లాపూర్ మండలం సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. బోధనా తీరు, విద్యార్థుల హాజరు, పరీక్షల సన్నద్ధతను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు.
News January 9, 2026
రాయవరంలో సీఎం సభస్థలిలో మహిళకు చోటు కరువు

రాయవరంలో శుక్రవారం నిర్వహించిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మహిళలకు సమస్తలంలో కూర్చోవడానికి కుర్చీలు లేక నేలపై కూర్చుని ఇబ్బందులు పడ్డారు. సీఎం చంద్రబాబు ప్రసంగం వినడానికి తరలివచ్చిన మహిళలకు పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చివరకు కుర్చీల కోసం పార్టీ కార్యకర్తలు లేచి మహిళలకు కుర్చీలు ఇవ్వాలని నాయకులు సూచించటం కొసమెరుపు.


