News December 19, 2025
పాలమూరు: బీసీల ప్రభంజనం.. 739 స్థానాలు కైవసం!

ఉమ్మడి పాలమూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 1,678 పంచాయతీల్లో 365 స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, అదనంగా 374 జనరల్ స్థానాల్లోనూ విజయం సాధించి మొత్తం 739 జీపీలను కైవసం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 193, నారాయణపేటలో 149, వనపర్తిలో 127, గద్వాలలో 149, నాగర్కర్నూల్లో 121 మంది బీసీ సర్పంచులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
Similar News
News December 20, 2025
నల్గొండ: GOVT జాబ్ కొట్టిన అమ్మాయి

గ్రూప్-3 ఫలితాల్లో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన యువతి సత్తా చాటారు. గ్రామానికి చెందిన నివేదిత గ్రూప్-3 పరీక్షలో విజయం సాధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందారు. తన తల్లిదండ్రులు బిక్షం రెడ్డి, సరిత సహకారం, నిరంతర కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని నివేదిత తెలిపారు.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా?

జున్నులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే ఇందులోని హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గర్భిణికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 20, 2025
అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలివే..

➤ ఉదయం 11.15కి కశింకోట (M) ఉగ్గినపాలెం హెలీప్యాడ్కు చేరుకుంటారు
➤11.30-11.55 వరకు APSR వసతి గృహం విద్యార్థులతో ముచ్చటిస్తారు
➤11.50కి బయ్యవరం సంపద కేంద్రాన్ని సందర్శిస్తారు
➤12.40కి తాళ్లపాలెం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు
➤2.55కి ఉగ్గినపాలెంలో క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు
➤సాయంత్రం 4.40కి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు
➤5.10కి హెలిప్యాడ్లో తిరుగుపయనమవుతారు


