News October 24, 2025
పాలమూరు: మళ్లీ పాలెం భయానకం.. చిన్నటేకూరు దుర్ఘటన

కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం 2013 అక్టోబర్ 30న జరిగిన పాలెం దుర్ఘటనను తలపించింది. అప్పట్లో 45 మంది సజీవదహనం కాగా, ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. మంటల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం వంటి రెండు చోట్లా ఒకే తరహా భయానక దృశ్యం కనపడింది.
Similar News
News October 24, 2025
సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
News October 24, 2025
గజ్వేల్: ‘డీసీసీబీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

DCCB బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కోరారు. గజ్వేల్లో నూతన DCCB బ్యాంకు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2,800 కోట్ల టర్నోవర్తో 49 బ్యాంకులు, 105 ఫాక్స్ ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీలో మిగతా బ్యాంకులతో పోల్చితే రూ.50 పైసలు అధిక వడ్డీ ఇస్తామన్నారు.
News October 24, 2025
జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయండి: కలెక్టర్

జిల్లాలో ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు నూరు శాతం పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఈ-క్రాప్ బుకింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.


