News December 14, 2025
పాలమూరు: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 565 గ్రామ పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గేటు లోపల ఉన్న ఓటర్లకు అనుమతించి పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 14, 2025
పుష్పగిరిలో వామన నరసింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం

వల్లూరులోని పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై నిల్చున్న వామన నర్సింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం విచిత్రంగా అద్భుతంగా ఉందని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి ధర్మ పరిరక్షణ కోసం చేసిన పది దశావతారాలలో మూడు అవతారాలను చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రదేశాలలో రాతిపై చెక్కడం కష్టమన్నారు.
News December 14, 2025
పంతిని సర్పంచ్గా శ్రీరామ్ భూపాల్రావు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్షణపల్లి శ్రీరామ్ భూపాల్రావు 592 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగించిన ఆయన ప్రత్యర్థులపై స్పష్టమైన పైచేయి సాధించారు. ఫలితాలు వెలువడగానే గ్రామంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీరామ్ భూపాల్రావు తెలిపారు.
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.


