News October 16, 2025
పాలమూరు: GREAT.. తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు!

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాపూర్ వాసి వేముల శ్రీనివాసులు(42) హైదరాబాద్లో మేస్త్రీ పని చేస్తూ ఈనెల 10వ తేదీన మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అతడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో కాలేయం, గుండె, కిడ్నీలు, కార్నియాస్ను ఆరుగురికి దానం చేశారు.
Similar News
News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 16, 2025
వరంగల్: 78 పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు!

బాలకల సాధికారత, బాలికల కౌమర దశ భద్రతా క్లబ్లను ఏర్పాటు చేస్తున్న ఆయా పీఎంశ్రీ పాఠశాలలకు రూ.15 వేల చొప్పున మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 78 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. నిధులు ఎలా వినియోగించుకోవాలో ఆ పాఠశాలల HMలకు సమాచారం అందించారు. ఈ నెల 15 వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాలి. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంది.
News October 16, 2025
VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.