News November 30, 2025

పాల్వంచ: నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎన్నికల సందర్భంగా కోడిపుంజుల వాగు పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల నోటిఫికేషన్ వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉంచి, అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

image

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.

News December 1, 2025

ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

image

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్‌లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.

News December 1, 2025

హుస్నాబాద్: ‘మా ఓటు విలువైనది.. అమ్మబడదు’

image

హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన భోజ అనిల్ కుమార్ ఫ్యామిలీ తమ ఇంటి ముందు ‘ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు- ఆ ఓటును మేము అమ్ముకోము’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారు చేసిన ఈ పనిని చూసి అందరూ సూపర్బ్ అంటున్నారు. ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అంటున్నారు.