News March 4, 2025

పించన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానం

image

పెన్షన్ల పంపిణీలో అల్లూరి జిల్లా మళ్లీ ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,22,907 మంది లబ్ధిదారులు ఉండగా 1,21,453 మందికి పంపిణీ చేసి 98.82 శాతంతో పంపిణీతో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఆరు నెలలుగా వరుసగా మొదటి స్థానం సాధిస్తూ వస్తున్న జిల్లా 7వ సారి కూడా మొదటి స్థానంలో నిలవడంతో అధికారులను అభినందించారు.

Similar News

News February 16, 2026

విజయవాడలో నేడు బిల్ గేట్స్ పర్యటన.. వివరాలివే!

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి వస్తున్నారు. ఉదయం 8:10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సచివాలయం చేరుకుంటారన్నారు. అలాగే మధ్యాహ్నం 12:40కు పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంకు విచ్చేయనున్నారు.

News February 16, 2026

రూ.10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు: మృణాల్

image

యాక్టర్‌గా ఉండటమంటే సన్యాసిగా జీవించడం లాంటిదేనని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. తిండి, నిద్ర వదులుకోవాలని, ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పారు. ‘నాకు PR టీమ్ లేదు. <<19123301>>నాపై వచ్చిన<<>> రూమర్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె నటించిన ‘దీ దీవానే సెహర్‌ మే’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.

News February 16, 2026

పాక్‌పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

image

T20 WCలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్‌తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్‌ను మన జట్టు ఓడించింది.