News February 26, 2026
పింఛన్ల పెంపుపై BIG UPDATE

TG: చేయూత పింఛన్లను తొలుత రూ.500 పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు ₹2,016, దివ్యాంగులకు ₹4,016 చొప్పున ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి నెలా ₹950కోట్ల వరకు ఖర్చవుతోంది. ₹500 పెంచితే ఏటా ₹2,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికల నాటికి దశలవారీగా పింఛన్లను ₹4వేలు, ₹6వేలకు పెంచాలని యోచిస్తోంది.
Similar News
News February 26, 2026
తీర్థం ఎలా తీసుకోవాలి?

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.
News February 26, 2026
364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 364 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ, బీటెక్, డిగ్రీ(BA, BCom, BBA, LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు NATS/NAPS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uraniumcorp.in
News February 26, 2026
‘వెలుగుమట్ల’ భూముల వివాదం.. హిస్టరీ ఇదే

TG: 1950sలో ఆచార్య వినోబా భావే ఆశయాలకు ఆకర్షితులైన రాయల కోటేశ్వరరావు అనే భూస్వామి ఖమ్మం(D) వెలుగుమట్లలో 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు అప్పగించారు. కాలక్రమంలో విలువ పెరగడంతో అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఆ భూమి అమ్మారు. సొంతింటి కలతో సామాన్యులు కొని ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టే విధించింది. దీంతో అధికారులు <<19224009>>నిర్మాణాలను<<>> తొలగిస్తున్నారు.


