News February 2, 2026
పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే..?

ఓ అరిటాకు తీసుకొని దానిపై మీరు చేసిన పిండి ప్రమిదను ఉంచాలి. అందులో అఖండ వత్తిని వేసి, ఆవునేతితో నింపాలి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని పలుకుతూ దీపం వెలిగించాలి. అనంతరం తర్వాత విష్ణు సహస్రనామం, అష్టోత్తరం చదువుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత, ఆ పిండిని చక్కెర పొంగలి లేదా గారెల్లా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఏడు శనివారాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
Similar News
News February 15, 2026
జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

TGలోని అండర్గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.
News February 15, 2026
T20 WC: USA భారీ స్కోర్

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.
News February 15, 2026
రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.


