News January 28, 2025

పిచ్చి మొక్కలను తొలగించి పండ్ల మొక్కలు పెంచాలి: కలెక్టర్

image

వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. మంగళవారం ఈ సందర్భంగా గ్రామంలోని నర్సరీని, జామ తోటను పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని, వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలకు ప్రతిరోజు నీరు పట్టాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మధుసూదన్, డీపీఓ మదన్మోహన్ తదితర అధికారులు ఉన్నారు.

Similar News

News February 17, 2026

అనకాపల్లి జిల్లాలో క్రీడలను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సహం అందిస్తే అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ది అధికారిణి శైలజతో కలిసి ‌క్రీడల గోడపత్రిక ఆవిష్కరించారు.

News February 17, 2026

పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

image

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

News February 17, 2026

నేడు విశాఖకు రాష్ట్రపతి

image

AP: రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు విశాఖపట్నం చేరుకోనున్నారు. 4.40PMకు నేవల్ ఎయిర్ స్టేషన్ ‘INS డేగా’ వద్ద ల్యాండ్ అవుతారు. నేవల్ బేస్‌లో నిర్వహించే విందులో పాల్గొంటారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా రేపు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విశాఖ వెళ్లనున్నారు.