News January 29, 2025

పిట్లం: అడవికి నిప్పు.. పట్టించుకోని అధికారులు

image

పిట్లం మండలం కిష్టాపూర్, చిన్న కొడప్గల్ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం నిప్పుపెట్టారు. ఈ మంటలు అడవి మొత్తం వ్యాపిస్తున్నాయి. ఆ పక్కనే పంట పొలాలు ఉండటంతో రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి అయినప్పటికీ మంటలు అదుపు అవ్వడం లేదు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 6, 2025

కల్వకుర్తిలో ఇంటి మెట్లపై ‘జెర్రిపోతు’ నిద్ర

image

కల్వకుర్తి శ్రీ సాయి కాలనీలోని పంచాయతీ సెక్రెటరీ రమేష్ ఇంటి ఆవరణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ మెట్లపై ప్రతిరోజు సాయంత్రం ఒక జెర్రిపోతు (పాము) వచ్చి పడుకుంటోంది. ఉదయం చూసినా అక్కడే ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది విషపూరితం కానప్పటికీ, పెద్ద పాము కావడంతో పిల్లలు భయపడుతున్నారన్నారు. మూడు రోజులుగా ఇలానే జరుగుతోందని వారు పేర్కొన్నారు.

News November 6, 2025

పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

image

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్‌, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.