News June 27, 2024
పిట్లం: గుండెపోటుతో యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719470619460-normal-WIFI.webp)
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పిట్లం మండలం హస్నాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ముజీజ్కు బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News July 1, 2024
NZB: మురుగు కాలువలలో పడి యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719807799100-normal-WIFI.webp)
నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 1, 2024
NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719798533521-normal-WIFI.webp)
భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News July 1, 2024
కామారెడ్డి: టమాట రైతు ‘పంట’ పండింది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719798590944-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.