News July 5, 2024

పిట్లం: చెరువులో మృతదేహం.. అసలేం జరిగింది..?

image

చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పిట్లంలో శుక్రవారం జరిగింది. పిట్లం గ్రామానికి చెందిన చిలుక అంజవ్వ(38) గ్రామంలోని మారేడ్ చెరువు వైపు వెళ్తుండగా.. ఆమెను చూసిన కొందరు.. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా వారు వచ్చి చూసేసరికి ఆమె చెరువులో పడి ఉంది. ఆమెను ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందింది. ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి పడిందా.. ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి వుంది.

Similar News

News July 8, 2024

రామారెడ్డి: బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి PS పరిధిలో జరిగింది. SI విజయ్ కొండ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ (45) మేస్త్రిగా పని చేస్తున్నాడు. సోమవారం పని నిమిత్తం ఉప్పల్వాయి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోసాని పేట్ జంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News July 8, 2024

పిట్లం: బ్యాంక్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1కు

image

పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన దామరంచ అనిల్ గౌడ్ గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మొదట బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయి కొన్ని రోజుల పాటు ఎస్సైగా విధులు నిర్వహించాడు. అనంతరం గ్రూప్-2లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం ACTOగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

News July 8, 2024

నిజామాబాద్: అగ్నివీర్‌లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేన అగ్నిపథ్‌లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువతీ యువకులు జులై 8 నుంచి జులై 28 వరకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.