News March 2, 2025

పిట్లం: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలం కోమటి చెర్వు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు వివరాలిలా.. కోమటి చెర్వు తండాకు చెందిన రమావత్ అనిల్(22) గత కొన్నేళ్లుగా మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News December 18, 2025

కర్నూలు: ఫలితాలు విడుదల

image

కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలను ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు బుధవారం విడుదల చేశారు. నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో 3వ సెమిస్టర్‌కు 866 మంది హాజరవ్వగా 617 మంది ఉత్తీర్ణత(71.25%) సాధించారు. 5వ సెమిస్టర్‌లో 804 మంది పరీక్షలు రాయగా 709 మంది పాస్(88.18%) అయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.శ్రీనివాస్, ఎగ్జామినేషన్స్ డీన్ నాగరాజ్ శెట్టి ఉన్నారు.

News December 18, 2025

సకల జాతక దోషాలను నివారించే ఆలయాలివే..

image

కాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య గుడిలోనూ సర్ప దోష నివారణ ఆచారాలు పాటిస్తారు. MHలో త్రయంబకేశ్వర్ ఆలయం ఈ దోష నివారణ పూజకు అత్యంత ముఖ్యమైనది. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయం(ఉజ్జయిని), ఓంకారేశ్వర్ ఆలయాలు కూడా సకల దోషాలను తగ్గించే శక్తివంతమైన ప్రదేశాలుగా భావిస్తారు. ఈ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జాతక దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

News December 18, 2025

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.