News October 13, 2024

పిట్లం: పోలీసులు కంట పడ్డారు.. ఇలా ఆగిపోయారు..

image

పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామ శివారు మంజీరా నది బ్రిడ్జి సమీపంలో బాన్సువాడ వెళ్లే రహదారిపై ఇవాళ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే వాహనదారులు పోలీసులను చూసి హెల్మెట్ లేక తమకు అపరాధ రుసుము (ఫైన్) వేస్తారని కూత వేటు దూరాన ఆగిపోయారు. ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ లేక గంటల తరబడి వేచి ఉన్నారు. హెల్మెట్ భారం కాదు భరోసా అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు.

Similar News

News October 13, 2024

NZB: ‘ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయం’

image

తెలంగాణ సంప్రదాయాల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ 19 ఏళ్లుగా జెండాలు, ఎజెండాలకు అతీతంగా దసరా మరుసటి రోజు నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం స్పూర్తి అని కొనియాడారు.

News October 13, 2024

బాసర అమ్మవారికి దిల్‌రాజు పూజలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.

News October 13, 2024

కామారెడ్డి: తండ్రి మృతదేహం లభ్యం

image

తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.