News March 11, 2025

పిట్లం: ‘Way2 News’ కథనానికి స్పందన..!

image

పిట్లం వాసి మిర్యాల చిరంజీవి కొడుకు అరవింద్(12) చిన్న వయస్సులోనే రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మందుల కోసం ఇప్పటికీ రూ.2.50 లక్షలు ఖర్చయింది. <<15721677>>’బాలుడికి కిడ్నీ సమస్య.. సాయం కోసం ఎదురుచూపులు’<<>> అనే శీర్షికతో Way2Newsలో ఇవాళ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాలుడి వివరాలు సేకరించి CMRF పథకం ద్వారా సాయం అందేలా చూస్తామన్నారు.

Similar News

News February 28, 2026

ఇండియన్స్‌కు ఎంబసీల సూచనలు

image

యుద్ధ <<19260918>>వాతావరణం<<>> దృష్ట్యా ఇజ్రాయెల్‌, ఇరాన్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయాలు సూచించాయి. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ అయితే ఇజ్రాయెల్‌లో +972-54-7520711, ఇరాన్‌లో +989128109115 OR +989128109109 నంబర్లకు కాల్ చేయాలని తెలిపాయి. అలాగే ఇరు దేశాల ఎయిర్‌స్పేస్‌ను మూసేయడంతో ఎక్కడికక్కడ విమాన ప్రయాణాలు ఆగిపోయాయి.

News February 28, 2026

మోదీ పర్యటన ముగిసిన వెంటనే ప్లాన్ అమలు!

image

ఇరాన్‌పై దాడికి అమెరికా-ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాయి. భారత PM మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన నేపథ్యంలో అటాక్‌ను వాయిదా వేసినట్లు నిపుణుల అంచనా. ఆయన దేశంలో ఉండగా ఉద్రిక్తతలకు తావు లేకుండా నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. కాగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై US దాడి చేస్తుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఇటీవల చెప్పిన <<19240749>>జోస్యం<<>> నిజమైంది.

News February 28, 2026

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

image

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్‌పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.