News March 13, 2025

పిఠాపురం: ఆవిర్భావ సభకు వచ్చే జనసైనికులకు పార్టీ హితవు

image

జనసేన ఆవిర్భావ సభకు లక్షల్లో క్యాడర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారికి పార్టీ కొన్ని సూచనలు చేసింది. ‘టోల్ ప్లాజా వద్ద గొడవలు పెట్టుకోవద్దు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. క్రమశిక్షణతో ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. సభాస్థలిలో ప్రశాంతంగా ఉండాలి. ప్రచార పత్రంలో పార్టీ అధ్యక్షుని ఫోటో, పార్టీ ఆమోదించిన వారి ఫోటోలే ఉండాలి’ అంటూ కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Similar News

News September 19, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

image

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.

News September 19, 2025

‘విజయ’ సీటు కోసం వార్..!

image

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

News September 19, 2025

ఈనెల 22న ‘కాంతార-1’ ట్రైలర్

image

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా ట్రైలర్ విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.