News October 12, 2025

పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌గా దొరబాబు..?

image

పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పదవిలో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జ్‌పై క్యాడర్ అసంతృప్తిగా ఉండటంతో, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దొరబాబు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 12, 2025

తిరుపతి : ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేర్కొంది. మొత్తం 10 విభాగాలలో 56 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.

News October 12, 2025

APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

image

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

News October 12, 2025

APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

image

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.