News March 30, 2025
పిఠాపురం పోలీసులపై జిల్లా ఎస్పీ సీరియస్

ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై కాకినాడ జిల్లా ఎస్పీ విందు మాధవ్ పిఠాపురం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం రూరల్ ఎస్ఐ లంచం తీసుకోవడం, ఒక కేసులో అనుమానితుడు జీపు డ్రైవర్గా ఉండటం పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటం, కొన్ని కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురం పోలీసులపై సీరియస్ అయ్యారు.
Similar News
News February 28, 2026
రూ.5,456.26 కోట్లతో TTD 2026–27 బడ్జెట్

TTD 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుమలలో అంశాలను వెల్లడించారు. విద్యాసంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్లు కేటాయించారు. తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్రూములు, హాస్టళ్లు, మౌలిక వసతుల మెరుగుదల చేయనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ముడుపు పత్రం పథకం UPI ద్వారా చెల్లింపుల సౌకర్యం ప్రారంభం కానుంది.
News February 28, 2026
మెట్పల్లి: పసుపు క్వింటాల్ @13,676

మెట్పల్లి మార్కెట్లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,676, కనిష్ఠ ధర రూ. 8,700. పసుపు గోళ గరిష్ఠ ధర రూ.12,305, కనిష్ఠ ధర రూ. 8,414. పసుపు చూర గరిష్ఠ ధర రూ. 12,333, కనిష్ఠ ధర రూ. 8,584గా పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మొత్తం 851 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయన్నారు.
News February 28, 2026
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ

TTD ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


