News June 14, 2024
పిఠాపురం మండలంలో దారుణ హత్య
పిఠాపురం మండలంలో దారుణ హత్య జరిగింది. భోగాపురంలోని దుర్గమ్మ ఆలయ ఆవరణలో నిద్రించిన బ్రహ్మదేపు ప్రసాద్ను పద్మరాజు అనే వ్యక్తి పెద్ద బండరాయితో మోది హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పిఠాపురం రూరల్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 2, 2024
కాకినాడలో మూడుసార్లు పర్యటించిన మహాత్మా గాంధీ
స్వాతంత్రోద్యమకాలంలో మహాత్మాగాంధీ కాకినాడలో మూడుసార్లు పర్యటించారు. 1921 ఏప్రిల్ 3న కాకినాడలో గాంధీజీ దంపతులు, వారి నాలుగో కుమారుడు రైలు దిగారు. గుర్రపు బండిపై పెద్ద బజారు గుండా జగన్నాథపురంలోని పైడా వెంకట నారాయణ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత 1930, 1933లలో రెండుసార్లు కాకినాడ వచ్చిన గాంధీ స్వాతంత్రోద్యమ సభల్లో పాల్గొన్నారు. ఈ విధంగా ఆయనకు తూర్పు గోదావరి జిల్లాతో సంబంధం ముడిపడి ఉంది.
News October 2, 2024
కోనసీమ: పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి
గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటు ప్రస్తుతం ఉండదని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మండపేట ఎన్నికల డీటీ అవతార్ మెహర్ బాబా పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యలయంలో మంగళవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 అక్టోబర్ 31 నాటికి పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులన్నారు.
News October 1, 2024
రాజానగరం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని భర్తీ చేయని సీట్లకు ఈనెల 5న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఐసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.