News February 25, 2025

పిఠాపురం: వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

image

జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. 

Similar News

News February 25, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా…

image

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 38.4°C నమోదు కాగా, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.1, కొత్తపల్లి-ధర్మారం 37.9, నుస్తులాపూర్ 37.8, తాంగుల, జమ్మికుంట 37.6, వీణవంక, కరీంనగర్ 37.4, ఖాసీంపేట 36.9, బురుగుపల్లి 36.7, గట్టుదుద్దెనపల్లె 36.6, తాడికల్, గంగాధర 36.4, చిగురుమామిడి, వెదురుగట్టు, ఇందుర్తి 36.3, అర్నకొండ 36.2, దుర్శేడ్ 36.1°C గా నమోదైంది.

News February 25, 2025

కరీంనగర్: యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలి: కలెక్టర్

image

ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

News February 25, 2025

మార్చి 1న కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

image

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.

error: Content is protected !!