News May 11, 2024
పిఠాపురానికి నేడు జగన్.. రామ్చరణ్

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. పిఠాపురంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. పూజల అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
News March 1, 2026
తూ.గో: ఇక ఆన్లైన్లో రవాణా సేవలు

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News February 28, 2026
RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


