News March 5, 2025

పిడింగొయ్యి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహాం ఉందని వీఆర్‌వో అప్పలనాయుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హండ్రెడ్‌ఫీట్‌రోడ్డులో కల్వర్టు పక్కన గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్‌వి.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 5, 2025

గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని ధర్నా

image

గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ కే మస్తాన్‌ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంతికి వినతి పత్రం అందచేశారు.

News March 5, 2025

తూ.గో: ఈనెల 11న బహిరంగా వేలం

image

వివిధ 6A కేసులలో సీజ్ చేసిన 47.274 టన్నుల PDS బియ్యాన్ని ఈనెల 11వ తేదీన గోపాలపురంలోని MLS పాయింట్ వద్ద బహిరంగా వేలం వేయటం జరుగుతుందని తూ.గో JC చిన్నరాముడు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ముందుగా రూ.2 లక్షల ధరావత్తును జేసీ పేరునా డీడీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. కేజీ బియ్యానికి ప్రభుత్వం పాట రూ.30 అని చెప్పారు.

News March 5, 2025

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 న్యాయస్థానాలలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజమండ్రి కేంద్రంగా ప్రకటించారు. రాజీమార్గమే రాజమార్గమని ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ నేరాలలో విముక్తి పొందాలని సూచించారు.

error: Content is protected !!