News January 7, 2026
పిడికిలెత్తిన బిక్కనూర్.. తగ్గేదేలే..!

‘ఫార్మా హటావో – బిక్కనూర్ బచావో’ అంటూ నినదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బిక్కనూర్ కమాన్, గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం, దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. <<18785446>>కంపెనీ ప్రాంగణానికి<<>> చేరుకుని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. ‘మా ఊరు- మా ఊపిరి’ అంటూ గళం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు.
Similar News
News February 12, 2026
NLG: స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత!

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
News February 12, 2026
నిర్మల్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 12, 2026
విద్యార్థులు ఏమనుకుంటారు.. YCP ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆవేదన

AP: నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన <<19108172>>తీరుపై<<>> స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీకి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. సభలో జరిగిన ఆ విధానాన్ని చూసి వారు ఏమనుకుంటారు. ఇంటికెళ్లిన తర్వాత వారు తోటి విద్యార్థులతో ఏం చెబుతారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో కాగితాలు చించి విసిరేశారు. అది సరైన పద్ధతేనా’ అని విచారం వ్యక్తం చేశారు.


