News October 8, 2025
పిడుగు పాటుకు రైతు, ఎద్దు మృతి

పిడుగు పడి రైతు గోవిందు (65), అతనితో పాటు ఉన్న ఎద్దు మృతి చెందిన ఘటన కణేకల్లు మండలం గరుడచేడులో బుధవారం చోటు చేసుకుంది. మరో ఇద్దరు షాక్కు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News October 8, 2025
తాడిపత్రి నుంచి ప్రపంచ స్థాయికి వినయ్.. ప్రశంసలు వెల్లువ

తాడిపత్రికి చెందిన వినయ్ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ మ్యాచ్ స్కోరర్గా ఎంపికయ్యాడు. వినయ్ RDT తరుఫున అండర్-16, 19 విభాగంలో జిల్లా జట్టుకు ఆడటమే కాకుండా.. అంపైర్, స్కోరర్గా రాణిస్తున్న సమయంలో ప్రతిభ గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో స్కోరర్గా ప్రస్తుతం సేవలందిస్తున్నాడు. ICC women Cricket World Cup-2025 మ్యాచ్లు వైజాగ్లో జరగనున్నాయి. ఇంగ్లాండ్ V/S న్యూజిలాండ్ జట్టు స్కోరర్గా చేయనున్నారు.
News October 8, 2025
సోలార్ ప్రాజెక్టు కోసం భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టు కోసం 5,862 ఎకరాల భూమిని గుర్తించగా, ఇందులో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News October 7, 2025
అనంతపురంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక

అనంతపురంలోని పాతూరులో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి చూపిన ధర్మమార్గం, సమానత్వం, న్యాయం పట్ల ఉన్న భావాలను మనమందరం ఆచరణలో పెట్టుకోవాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కొఠారి కుష్బూ, తదితరులు పాల్గొన్నారు.