News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.

Similar News

News July 1, 2024

మద్యం నిల్వ కేసు.. వైసీపీ MLA అభ్యర్థిని తండ్రి అరెస్ట్

image

మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థినిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైసీపీ నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు. దీంతో పోలీసులు శివనాగేంద్రంను శనివారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.

News July 1, 2024

గుంటూరు-ఔరంగాబాద్ రైలు ప్రారంభం

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు- ఔరంగాబాద్-గుంటూరు మధ్య నూతనంగా ప్రారంభించిన రైలు ఆదివారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఔరంగాబాద్ 13. 20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17254) ఔరంగాబాద్ లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటిరోజు 21.30 గంటలకు చేరుతుంది.

News July 1, 2024

MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు

image

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.