News December 28, 2025
పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?

ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. ఉప్పును ఎడమ చేత్తో తీసుకుని బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దీంతో ఉప్పు బిడ్డలోని ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. అలాగే బిడ్డపై ఉన్న చెడు ప్రభావం పోతుందని అంటారు. అనంతరం ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఈ ప్రక్రియ బిడ్డకు దృష్టిని మళ్లించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మార్గమని మరికొందరు అంటారు.
Similar News
News December 30, 2025
నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.
News December 30, 2025
కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 30, 2025
119 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


