News December 26, 2025

పిల్లలే దేశ భవిష్యత్‌కు పునాది: VZM కలెక్టర్

image

వీర్ బాల్ దివస్ వేడుకలు విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితో కలిసి జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

image

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 27, 2025

నేరాల నియంత్రణకు సమన్వయం అవసరం: VZM ఎస్పీ

image

నేరాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై దాడుల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యల్లో జిల్లా తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకొని 18 గ్యాంగులపై నిఘా, రూ.4 కోట్ల ఆస్తుల ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.

News December 27, 2025

VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.