News October 30, 2025

పీఎంశ్రీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలలకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్‌లను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.

News October 30, 2025

GNT: రంగస్థల కళాకారుడి నుంచి దర్శకుడు దాకా

image

ప్రముఖ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్‌ రావు (అక్టోబర్ 30, 1944-జనవరి 28, 2014) గుంటూరులో జన్మించారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు, తదితరులతో కలిసి నాటకాలలో నటించారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు.