News October 27, 2025
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. సోమవారం అమలాపురం పోలీసు కార్యాలయంలో ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలకు సంబంధించిన వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.
Similar News
News October 27, 2025
దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్ పోలీస్ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్ రిజర్వ్ బ్యాచ్కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.
News October 27, 2025
పాగుంట వెంకన్న హుండీ ఆదాయం రూ.11,26,292

కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.పురేందర్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. గత 11 నెలలకు గాను హుండీ ఆదాయం మొత్తం రూ.11,26,292 వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
News October 27, 2025
GWL: పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు- SP

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూవివాదాలు 4, కుటుంబ తగాదాలు1, గొడవలు 9, ఇతర అంశాలకు సంబంధించి 2, మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదన్నారు.


